Formula E Race Case: రేవంత్ నిజంగా మగాడే అయితే అసెంబ్లీలో చర్చ పెట్టాలి: కేటీఆర్

ఫార్ములా ఈ-రేస్(Formula E Race) వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత BRS ప్రభుత్వం, తనపై అనేక ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో మాజీ మంత్రి KTRపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణ(Telangana) రాష్ట్రానికి, హైదరాబాద్(Hyderabad) నగరానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వం ఫార్ములా ఈ-రేస్ నిర్వహించినట్లు స్పష్టం చేశారు. 2023లో ఈ రేస్ విజయవంతంగా జరిగి అన్నివర్గాల వారి మన్ననలను అందుకుందని కేటీఆర్ అన్నారు.

ప్రభుత్వం ప్రచారం చేస్తోంది: KTR

ఈ రేస్ వల్ల రాష్ట్రానికి రూ.700 కోట్లు లబ్ధి చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక(Nielsen Institute report) స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. కేవలం తమపై రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిజానికి ఫార్ములా రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందన్నారు. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా అంతా జన్యూన్‌గానే జరిగాయని KTR తేల్చి చెప్పారు. ఆయన CM రేవంత్ సర్కార్ తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రేవంత్ నిజంగా మగాడే అయితే అసెంబ్లీలో ఫార్ములా ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కుందని అన్నారు. అందుకోసం శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు CM రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

నిధుల దుర్వినియోగంపై కేసు

కాగా గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ(ANTI-CORRUPTION BUREAU) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేటీఆర్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 13(1)A, 13(2) PC యాక్ట్‌ కింద కేసులు నమోదు అయ్యాయి. మరో రెండు కేసులు BNS 409, 120B సెక్షన్లను చేర్చారు. నాలుగు సెక్షన్లు నాన్‌బెయిలబుల్‌ కేసులే పెట్టిన ACB అధికారులు, A-1గా KTR, A-2గా అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి IAS అధికారి అరవింద్‌ కుమార్‌, A-3గా HMDA చీఫ్‌ ఇంజినీర్‌ BLN రెడ్డి పేర్లను చేర్చారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *