Formula E Car Case: ఫార్ములా ఈ-కారు కేసు.. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్

ఫార్ములా ఈ-కారు రేసు కేసు(Formula E-car race case)లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నేడు (జూన్ 16) మరోసారి విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్(Telangana Bhavan) నుంచి ఉదయం 10 గంటలకు ACB కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు. ఈ కేసులో నిధుల మళ్లింపు, క్యాబినెట్ అనుమతి లేకుండా నిధుల విడుదల, బిజినెస్‌ రూల్స్‌ ఉల్లంఘన వంటి అంశాలపై ఐదుగురు సభ్యుల ఏసీబీ బృందం KTRను విచారించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో ఇప్పటికే సంబంధిత అధికారులను విచారించిన ఏసీబీ, ఆ తర్వాత కేటీఆర్‌నూ విచారించిన విషయం తెలిసిందే. నేటి విచారణ తర్వాత న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఫైనల్ ఛార్జిషీటు(Chargesheet) దాఖలు చేసే అవకాశముంది.

రూ.54.89 కోట్ల నిధుల దుర్వినియోగంపై కేసు

కాగా ఈ కేసులో కేటీఆర్‌కు మే 28న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు(ACB Notice) ఇచ్చింది. అయితే ఆ సమయంలో తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు ఆయన సమాచారం ఇచ్చారు. దీంతో జూన్ 16న తమ ఎదుట హజరవ్వాలని ఇటీవల ఏసీబీ మరోసారి నోటీసులు జారీచేసింది. కాగా గత BRS‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో రూ.54.89 కోట్ల నిధుల దుర్వినియోగం(Misappropriation of funds) అయినట్లు గత డిసెంబర్‌‌ 29వ తేదీన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

Formula-E race issue: Telangana ACB books case against KTR, Arvind  Kumar-Telangana Today

కేటీఆర్ వెంట భారీ బీఆర్ఎస్ శ్రేణులు.. పోలీసుల భద్రత

ఇక ఈ ఏడాది జనవరి మొదట్లో విచారణకు హాజరయ్యే క్రమంలో అధికారులు అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనక్కి వచ్చేశారు. ఆ సమయంలో ఆయన రాతపూర్వక వివరణ ఇచ్చారు. ఆ తర్వాత జనవరి 8న అర్వింద్‌‌కుమార్‌‌, జనవరి 9న కేటీఆర్‌‌, 10న HMDA బోర్డ్‌‌ మాజీ చీఫ్ ఇంజనీర్‌‌‌‌ BLN రెడ్డిని ఆ తర్వాత అదే నెల18న గ్రీన్‌‌కో ఏస్‌‌ నెక్స్ట్‌‌జెన్‌‌ MD చలమలశెట్టి అనిల్‌‌కుమార్‌‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కాగా నేటి విచారణకు కేటీఆర్ హాజరుకానుండటంతో పెద్దయెత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆయన వెంట వెళ్లే అవకాశముండటంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *