Kubera: ‘కుబేర’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతో తెలుసా?

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) మల్టీస్టారర్‌గా నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర(Kubera)’. క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. హోలీ యాంటిసిపేటెడ్ మూవీగా రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్(Sunil Narang), పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్(Posters), టీజర్, ట్రైలర్ సాంగ్స్(Songs) అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు హైప్ పెంచాయి.

Kubera' makers launch new poster on Ganesh Chaturthi; Dhanush looks unrecognizable | Tamil Movie News - Times of India

19 చోట్ల విజువల్స్ కట్ చేస్తూ నిర్ణయం

అయితే భారీ అంచనాల మధ్య ‘కుబేర(Kubera)’ జూన్ 20న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ సెన్సార్(Censor) పూర్తైయినట్టుల తెలుపుతూ రన్‌టైమ్‌(Run time)ను వెల్లడించారు. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ రాగా.. ఏకంగా 3 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో రాబోతుందని తెలిపారు. 13+ సినిమాగా దీన్ని అభివర్ణించారు. అయితే, సెన్సార్ సర్టిఫికేషన్ తర్వాత సినిమా యూనిట్ 19 చోట్ల విజువల్స్ కట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం విజువల్స్ డ్యూరేషన్ ఏకంగా 13 నిమిషాలు ఉండడం గమనార్హం. అలాగే ప్రేమ, దురాశ, థ్రిల్ అన్ని భావోద్వేగాలతో రాబోతుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

కాగా ఇప్పటికే పాజిటివ్ బజ్‌ని అందుకున్న ఈ సినిమా US మార్కెట్‌లో గ్రాండ్ ప్రీమియర్స్‌కి పాన్ ఇండియా భాషల్లో రెడీ అవుతోంది. తాజాగా ఈమూవీ నుంచి మరోసాంగ్ రిలీజ్ అయింది. ‘నా కొడుకా’ అంటూ సాగే పాటకు నంద కిశోర్ లిరిక్స్ అందించారు. దేవిశ్రీ ప్రసాద్(DSP) మ్యూజిక్ ఇచ్చిన ఈ పాటను సింధూరి విశాల్ ఆలపించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *