Maha Kumbh: కుంభమేళా తొక్కిసలాట ఇష్యూ.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే?

ఉత్తరప్రదేశ్‌(UP)లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా(Maha Kumbha Mela) నిర్వీరామంగా కొనసాగుతోంది. జనవరి 13 నుంచి జరుగుతున్న ఈ మహా కార్యక్రామానికి దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణీ సంగమం(Triveni Sangamam)లో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కుంభమేళాకు దాదాపు 35 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు సమాచారం. ఈనెల 26వ తేదీ వరకు ఈ ఆధ్యాత్మిక వేడుక కొనసాగనుంది. ఇదిలా ఉండగా గత నెల 29న మౌని అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమంలోని సంగం ఘాట్(Sangam Ghat) వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు(Supreme Court) స్పందించింది.

పిల్ స్వీకరణకు సుప్రీం నిరాకరణ

తొక్కిసలాట(Stampede Incident) దుర్ఘ‌ట‌న‌పై యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం(Yogi Adityanath Govt) బాధ్య‌త వ‌హించాలంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్(Petition) దాఖ‌లు అయింది. విశాల్ తివారీ అనే న్యాయ‌వాది ఈ వ్యాజ్యాన్ని వేశారు. కాగా, దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈ పిల్‌(pill)ను స్వీక‌రించడానికి నిరాక‌రించింది. ఇది ఒక దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న‌గా సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే పిల్ వేసిన న్యాయ‌వాదిని త‌న పిటిష‌న్‌తో అల‌హాబాద్ హైకోర్టు(Allahabad High Court)కు త‌ర‌లించాల‌ని న్యాయ‌స్థానం సూచించింది.

పార్ల‌మెంట్‌లో చర్చకు ప్రతిపక్షాల డిమాండ్

అటు ఈ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై స్పందించిన యూపీ ప్ర‌భుత్వం(UP Govt).. మృతుల కుటుంబాల‌కు రూ. 25ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం(Compensation) ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయితే, ఈ ఘ‌ట‌న‌పై ప్రతిప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి. ఇందులో భాగంగా ఈ ఘ‌ట‌న‌పై పార్ల‌మెంట్‌లో చర్చ జ‌ర‌పాల‌ని(A debate should be held in Parliament), మృతుల సంఖ్య‌పై పూర్తి స‌మాచారాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేర‌కు పార్ల‌మెంట్‌లో నిర‌స‌న‌కు సైతం దిగాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *