బంగాళఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు

బంగాళఖాతంలో ( Bay of Bengal) అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, (Andhra Pradesh) తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా.. తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. శనివారం బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వర్షాలుకురుస్తున్నట్లు పేర్కొంది. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం. .ఆదివారం రాత్రి లోపు అల్పపీడనం బలపడే అవకాశముంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహా సముద్రం (Indian Ocean) మీదుగా ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది.

తమిళనాడుకు భారీ వర్ష సూచన
అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కొనసాగుతూ.. డిసెంబర్ 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరంలోని నైరుతి బంగాళాఖాతం సమీపానికి చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. అల్పపీడన ప్రభావంతో డిసెంబర్ 11, 12 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) తెలిపింది. ముఖ్యంగా ఈ సమయంలో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయని చెప్పారు.

అల్పపీడనం ప్రభావంతో ఆదివారం తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం (Indian Meteorological Department) హెచ్చరించింది. ఈ రోజు వేకువజామున హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జిల్లాలో వర్షం పడుతోంది. అకాల వార్షాల కారణంగా చేతికందిన వరి, మిర్చి పంట తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *