ఎర్రజెండాను అణిచివేసే ధైర్యం ఎవరికీ లేదని, ఒకవేళ అదే చేయాలనుకుంటే ఎర్రజెండా మరింత ఎరుపెక్కుతుందని సీపీఎం కీలక నేత మడుపల్లి గోపాలరావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. గత పదేళ్లుగా చింతకాని మండల సీపీఎం కార్యదర్శిగా ఆయన విశేష సేవలు అందిస్తున్న గోపాలరావుకు తగిన గుర్తింపు లభించింది. ఈ మేరకు శనివారం ఆయనను మధిర డివిజన్ (MADHIRA) కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా గోపాలరావు విద్యార్థి దశ నుంచే ప్రజాపోరాటాల్లో క్రియాశీలకంగా పనిచేశారు.
చిన్నతనం నుంచే ప్రజా క్షేత్రంలోకి..
చిన్నతనం నుంచే ప్రజా, స్థానిక సమస్యలపై గళం విప్పారు. ఆయన సేవలకు పార్టీ అధిష్ఠానం కూడా అతనిని చింతకాని మండల కార్యదర్శిగా మూడు పర్యాయాలు కొనసాగించింది. తాజాగా ఆయనకు మధిర డివిజన్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా మడుపల్లి గోపాలరావు మాట్లాడుతూ.. గత పదేళ్లుగా తన వెంటూ ప్రజాపోరాటంలో పాలుపంచుకుంటున్న కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ప్రజలు చూపించిన ఆత్మీయత, సహాయ సహకారాలను గుర్తు చేసుకున్నారు. ఇకపై కూడా పార్టీకి, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతానని తెలిపారు.






