
భారతీయ సినిమా చరిత్రలో యానిమేషన్ చిత్రాలు(Animated Movies) భారీ విజయాలు సాధించడం చాలా అరుదు. అయితే, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ‘మహావతార్ నరసింహ(Mahavatar Narasimha)’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ పౌరాణిక చిత్రం(Animated mythological film), కేవలం రూ.40 కోట్ల బడ్జెట్(Budget)తో తెరకెక్కి, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్ల(Collections)ను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ సినిమాగా రికార్డు నెలకొల్పింది. అశ్విన్ కుమార్(Ashwin Kumar) దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్(Hombale Films), క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, విష్ణుమూర్తి దశావతారాల్లో నరసింహ అవతార కథను ఆధారంగా తెరకెక్కింది.
#MahavatarNarsimha opened with a decent ₹2.50 Cr Worldwide Gross on Day 1, yet achieves the unimaginable milestone of ₹300 Cr WW by the end of its 5th week.
From ₹2.50 Cr on Day 1 to ₹300 Cr on Day 35 – such UNPRECEDENTED box office growth has never been witnessed in the… pic.twitter.com/7j0KDqt5rb
— Sumit Kadel (@SumitkadeI) August 29, 2025
ఐదు వారాల పాటు థియేటర్లలో హౌస్ఫుల్
హిరణ్యకశిపుడు(Hiranyakashipa), ప్రహ్లాదుడు(Prahladha) కథాంశంతో రూపొందిన ఈ సినిమా, అద్భుతమైన VFX, భావోద్వేగ నరేషన్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ హీరోలు లేకపోయినా, మౌత్ టాక్తో ఈ చిత్రం ఐదు వారాల పాటు థియేటర్లలో హౌస్ఫుల్గా నడిచింది. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా అసాధారణ విజయం సాధించింది. ఈ మూవీ దెబ్బకు ‘హరి హర వీరమల్లు(MMVM)’, ‘వార్ 2’, ‘కూలీ(Coolie)’ వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైనా, ‘మహావతార్ నరసింహ’ కంటెంట్ బలంతో వసూళ్లలో ముందంజలో నిలిచింది.
యానిమేషన్ పరిశ్రమకు కొత్త ఊపిరి
మొదటి రోజు రూ.2.3 కోట్లతో ప్రారంభమైన ఈ చిత్రం, 30 రోజుల్లో రూ.291.45 కోట్లు, తాజాగా రూ.300 కోట్ల మార్కును అధిగమించింది. ఇది ‘సూర్యవంశీ’ (రూ.300 కోట్లు), ‘ది కేరళ స్టోరీ’ (రూ.304 కోట్లు) వంటి బాలీవుడ్(Bollywood) హిట్లను సైతం దాటేసింది.ఈ విజయం భారతీయ యానిమేషన్ పరిశ్రమకు కొత్త ఊపిరి పోసింది. ఈ చిత్రం ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో మొదటి భాగంగా, మిగిలిన ఆరు అవతారాల కథలను కూడా తెరకెక్కించనుంది. ఫుల్ రన్లో రూ.350 కోట్లు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.