Smriti Mandhana: మంధాన సూపర్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు

ఇంగ్లండ్‌ మహిళల(England Women) జట్టుతో జరుగుతున్న తొలి టీ20లో టీమ్ఇండియా(Team India) ఉమెన్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) సెంచరీతో చెలరేగింది. నాటింగ్‌హమ్‌లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 210/5 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌కు ఓపెనర్లు షెఫాలీ (20), మంధాన (112) తొలి వికెట్‌కు 8.3 ఓవర్లలోనే 77 పరుగుల భాగస్వామ్యం అందించారు. షెఫాలీ (Shefali) ఔట్ అయ్యాక వచ్చిన హర్లీన్ డియోల్ (43)తో సాయంతో మంధాన మెరుపులు మెరిపించింది. ఈ క్రమంలో టీ20ల్లో తొలి సెంచరీని పూర్తి చేసుకుంది. మంధాన కేవలం 51 బంతుల్లో 3 సిక్సర్లు, 15 ఫోర్ల సాయంతో శతకం(Century) పూర్తి చేసింది.

అంతకుముందు రిచా ఘోష్ (12), రోడ్రిగ్స్ (0)నిరాశపర్చారు. కౌర్ (3*), దీప్తి (7*) రన్స్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెల్ 3, అర్లోట్, ఎకిల్‌స్టోన్ చెరో వికెట్ తీశారు. కాగా ఇప్పటి వరకూ మంధాన మొత్తం 149 ఇంటర్నేషనల్ T20 మ్యాచులు ఆడి మొత్తం 3,878 రన్స్ చేసింది. ఇందులో 30 హాఫ్ సెంచరీలు ఉండగా.. ఈరోజు తొలి శతకాన్ని నమోదు చేసింది. కాగా ఇంగ్లండ్‌తో మ్యాచులో గెలవాలంటే 20 ఓవర్లలో 211 రన్స్ చేయాలి.

Image

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *