ఇండియాలో ముయిజ్జు.. భారత టూరిస్టులకు స్పెషల్ రిక్వెస్ట్

Mana Enadu : మాల్దీవుల అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్‌ ముయిజ్జు  భారత్ లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం ఆయన దిల్లీ చేరుకున్నారు. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్‌ (Sajidha Mohamed)తో కలిసి ఆయన ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు.

రాజ్‌ఘాట్‌లో ముయిజ్జు

ఈ సందర్భంగా మాల్దీవుల అధ్యక్షుడికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సాదర స్వాగతం పలికారు. అనంతరం భార్య సాజిదాతో కలిసి రాజ్‌ఘాట్‌లో (Rajghat) ముయిజ్జు నివాళులర్పించారు. ఈ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ.. భారత టూరిస్టు(Indian Tourists)లకు మాల్దీవుల అధ్యక్షుడు ఓ రిక్వెస్ట్ చేశారు.

మాల్దీవుల్లో పర్యటించండి ప్లీజ్

భారత టూరిస్టులు తమ దేశంలో పర్యటించాలని మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు(mohamed muizzu) ఆహ్వానించారు. వారు తమ ఆర్థికవ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నారని అన్నారు. ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ ప్రభుత్వ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో భారత్‌-మాల్దీవుల సంబంధాలు ఒడుదొడుకులకు లోనైన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే ఆయన నుంచి ఈ స్పందన వచ్చింది.

భారత్ లో ముయిజ్జు పర్యటన

కాగా, నాలుగు నెలల్లో ముయిజ్జు భారత్‌ (mohamed muizzu India Tour)కు రావడం ఇది రెండోసారి. అయితే తొలి ద్వైపాక్షిక పర్యటన మాత్రం ఇదే కావడం గమనార్హం. జూన్‌లో జరిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు భారత్‌కు వచ్చారు.

అక్టోబర్‌ 10 దాకా ఆయన భారత్‌లోనే పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి, ప్రధానితో ఆయన భేటీ కానున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలకు తోడు ఇరు దేశాలకూ ప్రయోజనకరమైన అంతర్జాతీయ అంశాలపై వీరి మధ్య చర్చలు జరుగుతాయని వెల్లడించింది. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *