Kannappa Collections: బాక్సాఫీస్ వద్ద ‘కన్నప్ప’ కలెక్షన్ల సునామీ

విష్ణు మంచు(Manchu Vishnu) నటించిన ‘కన్నప్ప(Kannappa)’ ఈ నెల 27న విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకునే ప్రదర్శన కనబరుస్తోంది. డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో, మోహన్ బాబు(Mohan Babu) నిర్మించిన ఈ భక్తి ఇతిహాస చిత్రం, శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ మూవీలో ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించడంతో ఈ చిత్రం పాన్-ఇండియా రేంజ్‌లో ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఇప్పటికే అన్నిచోట్ల మూవీకి హిట్ టాక్(Hit Talk) రావడంతో కలెక్షన్ల(Collections) పరంగానూ దూసుకెళ్తోంది. రెండ్రోజుల కలెక్షన్లను మూవీ టీమ్ ప్రకటించింది.

Kannappa Box Office Collection Day 1: Vishnu Manchu, Prabhas, Akshay  Kumar's film sees good start, mints THIS amount | Mint

‘కన్నప్ప’ భారతదేశంలో రూ. 16.5 కోట్ల నెట్ కలెక్షన్(Net Collections) సాధించిందని సాక్‌నిల్క్ నివేదించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా రెండ్రోజుల్లో రూ. 42.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రంగా నిలిచింది. దీంతో విష్ణు మంచు కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ను నమోదు చేసిన మూవీగా నిలిచింది. తెలుగు ప్రేక్షకుల నుండి 55.89% ఆక్యుపెన్సీ రేట్‌(Occupancy rate)తో భారీ ఆదరణ లభించగా, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ మంచి స్పందన వస్తోంది.

కాగా రివ్యూల్లో ఫస్టాఫ్‌పై నెగటివ్ ఇంప్రెషన్ వచ్చినా.. సెకెండాఫ్‌, క్లైమాక్స్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా బడ్జెట్ రూ. 200 కోట్లుగా అంచనా వేయగా, ఇది రూ. 180 కోట్ల గ్రాస్ సాధిస్తే హిట్ స్టేటస్ పొందే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. విష్ణు మంచు తన నటనతో మెప్పించగా, ప్రభాస్, అక్షయ్ కుమార్ కామియోలు బాక్స్ ఆఫీస్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ ఆకట్టుకుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *