Kannappa: ఓటీటీలోకి ‘కన్నప్ప’.. స్ట్రీమింగ్ తేదీ ఇదేనా?

మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప(Kannappa)”. మైథలాజికల్ డివోషనల్ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం జూన్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. శివభక్తుడైన కన్నప్ప చరిత్ర ఆధారంగా ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్(Prabhas), అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్ట్‌తో ఆకట్టుకుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ చిత్రం ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో విష్ణు నటన, విజువల్స్, BGMతో ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు “కన్నప్ప” ఓటీటీ రిలీజ్(Kannappa Ott Release) గురించి తాజా వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Kannappa release date: Vishnu Manchu, Prabhas, Mohanlal starrer  mythological film to release on THIS date

థియేట్రికల్ రన్‌ పూర్తికాక ముందే..

మంచు విష్ణు స్వయంగా ఈ సినిమా ఓటీటీలో 10 వారాల వరకు విడుదల కాదని ప్రకటించారు. అంటే థియేట్రికల్ రన్‌(Theatrical run)ను పూర్తి చేసుకున్నాకే ఓటీటీలోకి వస్తుందని విష్ణు తెలిపారు. ఈ లెక్కన (ఆగస్టు 25న) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి రావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం జులై 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కానుందని టాక్. ఈ మధ్యే కుబేర(Kubera) మూవీ కూడా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించినా.. ఊహించిన దాని కంటే త్వరగానే OTTలోకి వచ్చింది. తాజాగా అదే బాటలో కన్నప్ప(Kannappa) కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *