Kannappa Public Talk: మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప(Kannappa)’ టాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు(Mohan Babu) నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్, ఆక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. షెల్డాన్ ఛావు సినిమాటోగ్రఫిని, స్టీఫెన్ దేవస్సీ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ప్రీమియర్స్ అమెరికా(USA)లో మొదలయ్యాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా(SM) వేదికగా వెల్లడిస్తున్నారు.

Kannappa: Vishnu Manchu explains why Prabhas didn't attend the pre-release  event

కన్నప్ప సినిమాలో విష్ణు మంచు తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అతిథి పాత్రలో ప్రభాస్ ఎంట్రీ రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. మోహన్‌లాల్ క్యారెక్టర్ పెద్ద సర్‌ప్రైజ్. బీజీఎం, సినిమాలోని ఎలివేషన్స్ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. చివరి సీన్లు కంటతడి పెట్టిస్తాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం గ్యారెంటీ. ఈ మూవీకి నా రేటింగ్ 3.5/5 అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మంచు విష్ణు ఫైర్ బాగుంది. ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బ్లాక్ బాస్టర్ పక్కా అని కామెంట్ చేశారు..

ప్రభాస్ అతిధి పాత్రకు అన్ని చోట్లా సానుకూల స్పందనల 25 నిమిషాల విలువైన అతిధి పాత్ర రుద్ర ఆగమనం మాములుగా లేదు.. అని మరొకరు కామెంట్ చేశారు.

ఫస్ట్ హాఫ్ కాస్త డల్ అయ్యింది. కానీ సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్. బ్లాక్ బాస్టర్ పక్కా. బీజీఏం అదిరిపోయింది. ప్రభాస్, మోహన్ లాల్ పాత్రలు హైలెట్. అన్నీ సీన్లు బాగున్నాయి. తప్పక ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది.అని మరొకరు కామెంట్ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *