Khel Ratna : ఆ న‌లుగురికి ఖేల్‌ర‌త్న అవార్డు

భార‌తదేశంలో అత్యున్న‌త క్రీడా పుర‌స్కారం అయిన మేజ‌ర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ర‌త్న (Khel Ratna Award 2024) అవార్డుల‌ను తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈసారి నలుగురిని ఈ అవార్డు వరించింది. అందులో ప్ర‌పంచ చెస్ ఛాంపియ‌న్‌షిప్ విజేత గుకేష్‌ (Gukesh Dommaraju), షూటింగ్‌ స్టార్, ఒలింపిక్స్ విన్నర్ మ‌ను బాక‌ర్‌ (Manu Bhaker), హాకీ ప్లేయర్ హ‌ర్మ‌న్‌ప్రీత్‌ సింగ్‌, పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ ప్ర‌వీణ్ కుమార్‌ ఖేల్‌ర‌త్న అవార్డుకు ఎంపికయ్యారు.

మరోవైపు 17 మంది పారా అథ్లెట్లు స‌హా 32 మందిని అర్జున అవార్డులు వరించాయి. ఈ నెల 17వ తేదీన ఖేల్‌ర‌త్న అవార్డుల‌ను రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌దానం చేయ‌నున్నట్లు  కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ పురస్కారానికి ఎంపికైన నలుగురు క్రీడాభిమానులు కేంద్రానికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *