Medaram Jathara 2026: మేడారం మహా జాతర తేదీలు ఖరారు

తెలంగాణ(Telangana)లోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలో జరిగే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర (Medaram Sammakka-Saralamma Maha Jatara-2026) తేదీలు ఖరారయ్యాయి. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు.

సారలమ్మ ఆగమనంతో..

జాతర షెడ్యూల్ ప్రకారం వచ్చే జనవరి 28న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ(Saralamma), గోవిందరాజు, పగిడిద్దరాజు(Govindaraja, Pagiddaraja) గద్దెలపైకి చేరుకుంటారు. జనవరి 29న సమ్మక్క(Sammakka) దేవత చిలకలగుట్ట(Chilakalagutta) నుంచి గద్దెకు ఆగమనం అవుతుంది. జనవరి 30న భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. చివరి రోజైన జనవరి 31న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు వన ప్రవేశం చేస్తారు, దీంతో జాతర ముగుస్తుంది.

రూ. 75 కోట్ల నిధులతో ఏర్పాట్లు

తెలంగాణ కుంభమేళ(Telangana Kumbh Mela)గా పేరొందిన ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(AP), మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం జరిగే ఈ ఉత్సవంలో భక్తులు బెల్లం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఈ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. భక్తుల సౌకర్యం కోసం రూ. 75 కోట్ల నిధులతో ఏర్పాట్లు చేస్తోంది. శాశ్వత అభివృద్ధి పనులు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యం, రవాణా సౌకర్యాలు సిద్ధం చేస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *