Weather Alert: మూడు రోజులు వర్షాలు.. అన్నదాతకు వాతావరణశాఖ తీపికబురు

తెలంగాణ(Telangana)లోని రైతులకు వాతావరణ శాఖ(Meteorological Department) శుభవార్త చెప్పింది. మే చివరి వారంలో రాష్ట్రాన్ని పలకరించిన నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) ఆ తర్వాత ముఖం చాటేశాయి. తొలకరి వానలకు విత్తనాలు విత్తకున్న రైతుల(Farmers)కు ఆ తర్వాత నిరాశ ఎదురైంది. ఎండలు తీవ్రంగా ఉండటంతో విత్తిన విత్తు భూమిలోనుంచి బయటికి రాకుండానే మాడిపోయింది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వర్షాలపై వాతావరణశాఖ(IMD) అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం(Northwest Bay of Bengal)లో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో..

వాయవ్య అరేబియన్ సముద్ర తీర ప్రాంతం(Arabian Sea coast) నుంచి ద్రోణి ఒకటి దక్షిణ గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వాయవ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 – 7.6 కి.మీ మధ్యలో ఏర్పడిందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ(Telangana)లో 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40KM నుంచి 50KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

కాగా ఇవాళ రాత్రి నుంచి ఆదిలాబాద్‌(Adilabad), కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *