Microsoft layoffs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు.. ఎందుకంటే?

Microsoft layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ తొలగించింది. దీనికి కారణం మైక్రోసాప్ట్ లో కోడింగ్ లో 30 శాతం ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించడమే అని తెలుస్తోంది. ఇక్కడే ఒక ట్విస్టు వచ్చి పడింది. ఏఐ వినియోగాన్ని డెవలప్ చేయాలని మొదట ఉద్యోగులకు సూచనలు పై ఆఫీసర్లు సూచనలు చేయడంతో వారు దాన్ని కష్టపడి డెవలప్ చేశారు. ఇదే ఉద్యోగులు చేసిన తప్పు అయింది. తాము డెవలప్ చేసిన ఏఐతోనే తమ ఉద్యోగులకు ఎసరు తెచ్చుకున్నారు.

తాము తయారు చేసింది.. తమకే పెనుశాపమై

ప్రస్తుతం మనుషులతో కాకుండా ఏఐతో 30 శాతం కోడింగ్ రాయిస్తూ మైక్రో సాప్ట్ (Microsoft) ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఏఐ వ్యవస్థలు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే (Software Engineers) దీనికి సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారని ఇంటర్నేషనల్ మీడియాలో (International media) కథనాలు రావడం సంచలనం కలిగిస్తోంది. ఏకంగా తన కంపెనీలో మూడు శాతం ఉద్యోగులను తొలగించడంతో మైక్రోసాప్ట్ ఏఐ ను ఎంతలా వాడుకుంటుందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు.

Microsoft layoffs 2025: Tech giant to cut several thousands of  underperforming employees this year – Firstpost

2023లో 10 వేల మంది.. ఇప్పుడు మూడు వేల పైనే..

వాషింగ్టన్‌లో (Washington) 40 శాతానికి పైగా ఉద్యోగులను తొలిగించగా అందులో ఎక్కువగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే ఉండటం గమనార్హం. ఏఐ మెషీన్ పరికరాల వినియోగాలన్ని పెంచాలని సంస్థ చెప్పగా దానికి అనుగుణంగా ఉద్యోగులు కృషి చేసి పెంచారు. అనంతరం ఏఐ తో పనులు కానిచ్చేస్తున్న సంస్థ.. అందులోని ఉద్యోగులను మెల్లిమెల్లిగా తొలిగించేస్తోంది. టెక్నికల్ ప్రోగ్రామ్, జూనియర్ కోడర్స్ తో పాటు చివరకు ఏఐ డైరెక్టర్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. కాగా 2010లో 10 వేల మంది ఉద్యోగులకు మైక్రో సాఫ్ట్ ఉద్వాసన పలకగా.. ఆ తర్వాత ఇప్పుడే ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగులను తీసేయడం అని తెలుస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *