Currency: రూ.500 నోట్ల సరఫరా నిలిపివేత.. ఆర్థికశాఖ సహాయ మంత్రి ఏమన్నారంటే?

దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న రూ.500 నోట్ల సరఫరాను నిలిపివేయనున్నారంటూ సోషల్ మీడియా(Social Media)లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రూ.500 నోట్ల(Notes)ను ఆపే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. ATMలలో రూ.500 నోట్ల జారీ యథావిధిగా కొనసాగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ విషయంపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి(Minister of State for Finance Pankaj Chaudhary) రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రజల లావాదేవీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ బ్యాంక్ (RBI)తో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఏ నోట్లను ఎంత మేర ముద్రించాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన వివరించారు. రూ.500 నోట్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లుగా వాట్సాప్‌లో వస్తున్న సందేశాలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.

500 Rupee Images – Browse 3,323 Stock Photos, Vectors, and Video | Adobe  Stock

అయితే, ప్రజలకు రూ.100, రూ.200 వంటి చిన్న డినామినేషన్ నోట్ల(Denomination notes) లభ్యతను పెంచేందుకు RBI చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా, ఈ ఏడాది ఏప్రిల్ 28న ఇహఉ ఒక సర్క్యులర్ జారీ చేసిందని గుర్తుచేశారు. దాని ప్రకారం, అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు(White Label ATM Operators) తమ ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించినట్లు చెప్పారు.

ఫేక్ న్యూస్‌పై స్పందించిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్

సెప్టెంబర్ 30 నాటికి దేశంలోని 75 శాతం ATMలలో కనీసం ఒక క్యాసెట్ నుంచి రూ.100 లేదా రూ.200 నోట్లు వచ్చేలా చూడాలని, అలాగే వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో ఈ సౌకర్యం కల్పించాలని RBI లక్ష్యంగా నిర్దేశించిందని పంకజ్ చౌదరి తన సమాధానంలో పేర్కొన్నారు. కాగా, సెప్టెంబర్ 30 నుంచి ఏటీఎంలలో రూ.500 నోట్లు నిలిచిపోతాయని, ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకోవాలని సూచిస్తూ వాట్సాప్‌లో ఓ సందేశం విస్తృతంగా వ్యాపించింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా స్పందించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *