Fish Venkat: ఫిష్ వెంకట్‌ను పరామర్శించిన మంత్రి వాకిటి.. అండగా ఉంటామని భరోసా

ప్రముఖ సినీ నటుడు, తన విలక్షణ నటనతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్(Fish Venkat) అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌(Hyderabad)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) సోమవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ICUలో చికిత్స పొందుతున్న వెంకట్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి, వెంకట్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఫిష్ వెంకట్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

తక్షణ సాయంగా రూ.లక్ష అందజేత

“ఫిష్ వెంకట్ అనారోగ్యం గురించి తెలియగానే ఆయన్ను చూడటానికి వచ్చాను. తన సహజమైన నటనతో, తెలంగాణ(Telangana) మారుమూల యాసను వెండితెరకు పరిచయం చేసిన గొప్ప కళాకారులలో ఆయన ఒకరు” అని ప్రశంసించారు. ఫిష్ వెంకట్(Fish Venkat) చికిత్సకు తక్షణ వైద్య ఖర్చుల కోసం కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఆయనకు ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *