తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections 2025) నగారా మోగింది. ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.  ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి  27న పోలింగ్‌ నిర్వహించి.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ప్రకటించింది.

తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు

తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు (Teacher MLC Election) జరగనున్న విషయం తెలిసిందే. మరోవైపు అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. మరోవైపు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఏపీలో రెండు స్థానాలకు ఎన్నికలు

మరోవైపు ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు (Graduate MLC Elections 2025) జరగనున్నాయి.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది.

ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ్య తేదీలు ఇవే

  1. ఎన్నికల నోటిఫికేషన్ – ఫిబ్రవరి 3
  2. ఎన్నికల పోలింగ్ – ఫిబ్రవరి 27
  3. ఓట్ల లెక్కింపు – మార్చి 3

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *