మహాకుంభమేళా.. ఇప్పటివరకు 10 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు

144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా (Kumbh Mela 2025) ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ఈ కుంభమేళాకు వేడుకయింది. ఈ మేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. రోజు లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

ఇప్పటివరకు 10 కోట్లకుపైగా భక్తులు

గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈరోజు మధ్యాహ్నం వరకు 30 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు వెల్లడించింది. మకర సంక్రాంతి రోజు దాదాపు 3.5 కోట్ల మంది సంగమంలో స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.

45 కోట్ల భక్తులు వస్తారని అంచనా

ఈ సారి కుంభమేళాకు 45 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేయగా.. ఇప్పటివరకు 40 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చినట్లు సమాచారం. జనవరి 13వ తేదీన మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈసారి కుంభమేళా ద్వారా 12 లక్షల మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *