Mrinal Thakur: క్లోజ్‌గా కనిపించినంత మాత్రాన అంతేనా.. డేటింగ్ వార్తలపై మృణాల్

బాలీవుడ్, టాలీవుడ్‌(Tollywood)లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్(Mrinal Thakur), తమిళ స్టార్ హీరో ధనుష్‌(Dhanush)తో డేటింగ్ రూమర్స్‌(Dating Rumors)పై తాజాగా స్పందించారు. ఈ రూమర్స్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ కావడంతో, మృణాల్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. “ధనుష్ నాకు మంచి స్నేహితుడు(Friend) మాత్రమే. ఈ రూమర్స్ నన్ను నవ్వించాయి. ‘సన్ ఆఫ్ సర్దార్ 2(Son of Sardar 2)’ ప్రమోషన్ ఈవెంట్‌కు ధనుష్ హాజరవడాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అజయ్ దేవగన్‌(Ajay Devgan)తో ధనుష్‌కు మంచి స్నేహం ఉంది, అతని ఆహ్వానంతోనే ఈవెంట్‌కు వచ్చారు” అని మృణాల్ వివరించారు.

తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదు

ఈ రూమర్స్‌కు కారణం ధనుష్, మృణాల్ కలిసి పలు ఈవెంట్‌లలో కనిపించడమే. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్‌తో పాటు, మృణాల్ పుట్టినరోజు వేడుక(Mrinal’s Birthday Celebrations)ల్లో ధనుష్ సన్నిహితంగా కనిపించడం, ఇన్‌స్టాగ్రామ్‌లో ధనుష్ సోదరీమణులను ఫాలో చేయడం వంటి అంశాలు ఊహాగానాలకు ఆజ్యం పోశాయి. అయితే, మృణాల్ ఈ వార్తలను కొట్టిపారేస్తూ, తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని స్పష్టం చేశారు. “క్లోజ్‌గా కనిపించినంత మాత్రాన డేటింగ్ అని అనుకోవడం సరికాదు” అని ఆమె అన్నారు.

Are Dhanush and Mrunal Thakur dating? Duo caught romantically hold hands, whispering in each other's ears - IBTimes India

18 ఏళ్ల వివాహం తర్వాత 2022లో విడాకులు

ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య(Rajinikanth’s daughter Aishwarya)తో 18 ఏళ్ల వివాహం తర్వాత 2022లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి అతని వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లో నిలుస్తోంది. మృణాల్ కూడా ‘సీతారామం(Sitharamam)’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచారు, కానీ బాలీవుడ్‌(Bollywood)లో ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ రూమర్స్‌పై మృణాల్ ఇచ్చిన స్పష్టతతో ఈ గాసిప్స్‌కు తెరపడినట్లు కనిపిస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *