సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలు చేస్తూ కుర్రాళ్లకు పోటీ ఇస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిసారిగా జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నారు. ఇందులో సౌబిన్ షకీర్, ఉపేంద్ర రావు, శ్రుతి హాసన్, సత్యరాజ్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న థియేటర్లలోకి రానుంది. దీనికి సంబంధించి చిత్రబృందం గతంలోనే అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు త్వరలోనే 2023లో విడుదలైన జైలర్ చిత్రానికి సీక్వెల్ గా జైలర్ 2 సినిమా రాబోతోంది. చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. జైలర్ 2 మూవికి సంబంధించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో కనిపించనున్నారట. గతంలో ఈ చిత్రంలో ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించగా ఇప్పుడు అతడి స్థానంలో నాగార్జున నటిస్తున్నారని వార్త వినిపిస్తుంది. అయితే ఈ వార్త ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.






