Nagarjuna Sagar Dam: సాగర్‌కు జలకళ.. 8 గేట్లు ఓపెన్

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 580.60 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఆగస్టు 11న ఎనిమిది క్రస్ట్‌ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి, దిగువకు 64,465 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 65,800 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, ఔట్‌ఫ్లో 1,10,483 క్యూసెక్కులుగా ఉంది. జలాశయ నీటి నిల్వ 312.04 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా నాగార్జున సాగర్‌లో నీటి ఒత్తిడి పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు. గేట్లు ఎత్తివేతతో కృష్ణమ్మ పరవళ్లు అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తుండటంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *