Akhanda 2 Tandavam: ‘అఖండ-2’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ తేదీ ఇదేనా?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా, బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2 తాండవం(Akhanda 2 Tandavam)’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో విడుదలైన ‘అఖండ(Akhanda )’ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో, దీని సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా(Release date postpone) అయినట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇందులో బాలయ్య మరోసారి పవర్‌ఫుల్ అఘోరా పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సీక్వెల్‌లో ఆధ్యాత్మికత, మాస్ యాక్షన్ మరింత ఎంటర్టైన్మెంట్ అందించనుంది.

షూటింగ్ షెడ్యూల్‌లో జాప్యంతోనే..

మొదట ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న దసరా(Dussera) కానుకగా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలయ్య పుట్టిన రోజు(Balakrishna Birthday) సందర్భంగా విడుదలైన టీజర్‌లో కూడా ఈ తేదీని నిర్ధారించారు. కానీ, షూటింగ్ షెడ్యూల్‌లో జాప్యం, గ్రాఫిక్స్ పనులు పూర్తికాకపోవడం, అలాగే అదే తేదీన పవన్ కళ్యాణ్ చిత్రం ‘OG’ విడుదల కావడంతో పోటీ తప్పదని భావించి, ‘అఖండ 2’ రిలీజ్‌ను డిసెంబర్ 18కి వాయిదా వేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి.

‘రాజాసాబ్’ వంటి చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ..

ఈ సినిమాలో సంయుక్త మీనన్(Samyukta Menon) హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి(Aadi Pinisetty) విలన్‌గా నటిస్తున్నారు. జార్జియా, ప్రయాగ్‌రాజ్‌లలో షూటింగ్ జరిగింది, కానీ వర్షాల వల్ల కొన్ని షెడ్యూల్స్ రద్దయ్యాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. డిసెంబర్‌లోనూ ‘రాజా సాబ్’ వంటి చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ, మేకర్స్ ఈ తేదీని లాక్ చేసే అవకాశం ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *