ఈ నగరానికి ఏమైంది సీక్వల్.. కీలక పాత్రలో నందమూరి బాలకృష్ణ! ఇప్పుడిదే హాట్ టాపిక్

తెలుగు యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ ప్రాజెక్టును ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ‘ఈNఈ రిపీట్’ అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోందని స్పష్టం చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, ఈ సీక్వెల్‌లో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.

మొదటి భాగం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులు విష్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను ఈ సీక్వెల్‌లోనూ తమ పాత్రలను కొనసాగిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేశ్ బాబు, సృజన్ యరబోలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదటి భాగానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన వివేక్ సాగర్ ఈ సీక్వెల్‌కు కూడా స్వరాలు సమకూర్చనున్నారు.

అయితే ఈ ప్రాజెక్టుతో నటసింహం బాలకృష్ణ కనిపించబోతున్నట్లు వస్తున్న వార్తలపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. నటుడు విష్వక్ సేన్‌కు బాలకృష్ణ అంటే అసాధారణమైన అభిమానం ఉంది. తన అభిమాన హీరో ఈ చిత్రంలో కనిపించాలని విశ్వక్ కోరడంతో బాలకృష్ణ వెంటనే ఓకే చేశారన్న టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. కాకపోతే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బాలకృష్ణ నిజంగా ఈ చిత్రంలో భాగమైతే, ‘ఈNఈ రిపీట్’ పై అంచనాలు మరింతగా పెరగడం ఖాయమని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సో, చూడాలి మరి ఏం జరుగుతుందనేది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *