ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తన సతీమణి బ్రాహ్మణికి సంక్రాంతి వేడుకల సందర్భంగా అపురూప కానుక అందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ఆయన ఇచ్చిన గిఫ్ట్ అందుకున్న బ్రాహ్మణి.. తన భర్త లోకేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె కూడా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఇంతకీ నారా లోకేశ్ ఇచ్చిన బహుమతి ఏంటంటే..?
మంగళగిరిలో తయారు చేసిన చేనేత చీరను నారా లోకేశ్.. బ్రాహ్మణి (Nara Brahmani)కి సంక్రాంతి కానుకగా అందించారు. ఇక్కడి చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమైందని ఎక్స్ లో ఓ పోస్టు పెట్టి కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారికి మద్దతిచ్చి చేనేతను ఆదుకునే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా లోకేశ్ అందరినీ కోరారు.
Thank you, @naralokesh! This exquisite Mangalagiri saree is truly special, not just for its elegance but for its story of tradition and craftsmanship. It’s a privilege to wear the work of our talented weavers. Wishing everyone a very Happy Sankranti filled with joy and… https://t.co/sbvj6sF9Wx
— Brahmani Nara (@brahmaninara) January 14, 2025
మరోవైపు తన భర్త ఇచ్చిన కానుక గురించి బ్రాహ్మణి కూడా ఓ పోస్టును తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. నారా లోకేస్ పోస్టును రీపోస్టు చేస్తూ.. మంగళగిరి చేనేత చీర చాలా ప్రత్యేకంగా ఉందని అన్నారు. అందమైన చీరను తనకు బహుమతిగా ఇచ్చినందుకు లోకేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నైపుణ్యంతో తీర్చిదిద్దిన చేనేత చీరను తీసుకోవడం సంతోషాన్నిచ్చిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.








