ఇందూరు రైతులకు సంక్రాంతి కానుక.. పసుపు బోర్డు ప్రారంభం

ఇందూరు జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటఫలం లభించింది. ఎట్టకేలకు జాతీయ పసుపు బోర్డు (National Turmeric board) నిజామాబాద్‌లో ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్‌గా దీనిని ఇవాళ (జనవరి 14వ తేదీన) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పాల్గొన్నారు.

2023లో ప్రకటన.. 2025లో ఏర్పాటు

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ సభలో నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబరు 4వ తేదీన కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా నిజామాబాద్‌లో బోర్డు (Nizamabad Turmeric Board) ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.

పసుపు బోర్డు ఛైర్మన్ ఎవరంటే..

ప్రస్తుతం నిజామాబాద్‌లో ఉన్న రీజినల్‌ స్పైస్‌ బోర్డు కార్యాలయంలోనే పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ బోర్డుకు ఛైర్మన్‌గా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. . ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మరోవైపు తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *