Nidhhi Agerwal: ట్రైలర్‌తో రూమర్స్‌​కు చెక్​ పడింది.. నిధి అగర్వాల్​ ఆసక్తికర వ్యాఖ్యలు

వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్​ నిధి అగర్వాల్​ (Nidhhi Agerwal). పవన్​ కల్యాణ్​తో (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ ఫస్ట్​ పార్ట్​ షూటింగ్​ పూర్తిచేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు, డార్లింగ్​ ప్రభాస్​తో (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Raja Saab) షూటింగ్​లో పాల్గొంటోంది. ఆ తర్వాత కూడా పలు మూవీస్​కి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. జులై 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నిధి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తెలుగు ప్రేక్షకులు అంతే తనకు ఎంతో ఇష్టమన్నారు. వీరమల్లు మూవీ గురించి, పవన్​ గురించి మాట్లాడారు.

Image

ట్రైలర్​ను ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు

“హరిహర వీరమల్లు సినిమా విజువల్ వండర్​లా ఉంటుంది. ఏఎం రత్నం ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఆయనతోపాటు టీమ్​ అంతా సినిమా విజయంపై ఎంతో ధీమాగా ఉన్నారు. ట్రైలర్​ను ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. ఈ సినిమా ప్రారంభంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక వాటన్నిటికీ చెక్ పడింది. మనం ఓ పని చేస్తున్నప్పుడు ఎన్నో కామెంట్స్ వినిపిస్తాయి. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేయాలి. మొదట బాలేదు అన్న ప్రేక్షకులే వెంటనే చాలా బాగుంది అని అంటారు. చాలా బాగా యాక్ట్​ చేశారు అని కామెంట్ చేస్తారు. అందుకే రూమర్స్​ను పట్టించుకోకుండా మన పని శ్రద్ధగా చేస్తూ ఉండాలి’ అని పేర్కొన్నారు.

Second single from 'Hari Hara Veera Mallu' turns out to be an instant  chartbuster; film to release on March 28 - Telangana Today

ప్రతి విభాగంలోనూ ఆయన భాగమయ్యారు

హరిహర వీరమల్లు కోసం పవన్ (Pawan Kalyan) ఎంతో కష్టపడ్డారని, సినిమాలో ప్రతి విభాగంలోనూ ఆయన భాగమయ్యారని తెలిపారు. డైలాగ్స్, పాటలు, యాక్షన్ సన్నివేశాలు అన్నిటికీ సలహాలిచ్చారన అన్నారు. ‘ఎన్నికల ముందు దీన్ని ప్రారంభించిన ఆయన.. డిప్యూటీ సీఎం అయ్యాక దీన్నే మొదట పూర్తిచేశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. విజయవాడలో షూటింగ్ చేసినన్ని రోజులు ఒకవైపు మీటింగ్​లో పాల్గొంటూనే షూటింగ్​కు వచ్చేవారు. హరిహర వీరమల్లు పార్ట్-2 కూడా 20 నిమిషాల షూటింగ్ పూర్తిచేశాం. మొదటి పార్ట్ విడుదలైన తర్వాత దాన్ని తిరిగి ప్రారంభిస్తాం” అని నిధి అగర్వాల్ తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *