Pakistan Airspace: ఏర్‌స్పేస్ మూసివేత.. మరో నెల పొడిగించనున్న పాక్?

భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తూ పాకిస్థాన్(Pakistan closing its airspace) తీసుకున్న నిర్ణయాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్(Pakistan) ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(terrorist attack) అనంతరం భారత్ చేపట్టిన చర్యలకు ప్రతిస్పందనగా, పాకిస్థాన్ గత నెలలో భారత విమానాలపై తమ గగనతలంలో ప్రయాణించకుండా నిషేధం విధించింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(International Civil Aviation Organization Rules) నిబంధనల ప్రకారం గగనతల ఆంక్షలను ఒకేసారి నెల రోజులకు మించి విధించకూడదు. దీంతో మే 23 వరకు ఈ నిషేధం అమల్లో ఉంది.

ఆపరేషన్ సిందూర్‌తో నిర్ణయం

తాజాగా ఈ నిషేధాన్ని మరో నెల పొడిగించాలని పాకిస్థాన్ నిర్ణయించినట్లు జియో న్యూస్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన (Notice to Airmen-NOTAM) ఈరోజు (మే 22) వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతిస్పందనగా మే 7న భారత సైన్యం ‘Operation Sindoor’ పేరుతో పాకిస్థాన్, POKలోని ఉగ్రవాద స్థావరాల(Terrorist bases)పై దాడులు నిర్వహించింది. దీంతో పాక్ తన గగనతలాన్ని మూసివేసింది.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *