India vs Pakistan: భార‌త్ భీక‌ర దాడుల‌తో పాక్ వ‌ణికిపోయింది

భార‌త్ ఆప‌రేష‌న్ సిందూర్ లో భాగంగా పాక్ పై శ‌క్తిమంత‌మైన దాడుల‌తో విరుచుకుప‌డ‌టంలో పాకిస్థాన్ ప్ర‌పంచ దేశాల‌పై ప‌డి ఎలాగైనా స‌రే దాడుల‌ను ఆపాల‌ని వేడుకుంద‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ (Union Defence Minister Rajnath Singh) మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. శుక్ర‌వారం భారత నౌక‌ద‌ళం బాస్ విమాన వాహ‌న నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ర‌క్షణమంత్రి ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు.

నావికాద‌ళం చూపిన పాత్ర వెల‌క‌ట్ట‌లేనిది..

ఆపరేష‌న్ సిందూరు (Operation Sindoor) స‌మ‌యంలో నావికాద‌ళం చూపిన పాత్ర వెల‌క‌ట్ట‌లేనిది. పాక్ దేశంలో ఉన్న ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై వైమానిక ద‌ళం విరుచుకుప‌డి నేల‌మ‌ట్టం చేసింది. దీంతో పాటు స‌ముద్రంలో నావికాద‌ళం ప్రిప‌రేష‌న్ చూసి పాకిస్థాన్ వ‌ణికిపోయింది. పాక్ నావికాద‌ళాన్ని ఎక్క‌డా కూడా క‌ద‌ల‌నీయ‌కుండా చేసింది. భార‌త్ ముంద‌స్తు మోహరింపుతో పాక్ ను మాన‌సికంగా దెబ్బ‌కొట్ట‌డంతో పాటు వారి ఎయిర్ బేస్ ల‌పై దాడుల‌తో నావికా శ‌క్తిని ప్ర‌పంచానికి చాటి చెప్పార‌న్నారు. ఇండియ‌న్ నేవీ శ‌క్తి సామ‌ర్థ్యాలు, ధైర్య సాహసాలు చూసి శ‌త్రుదేశం భ‌యాందోళ‌న‌కు గురైంద‌ని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పాకిస్థాన్ తో ఆప‌రేష‌న్ సిందూర్ ముగియ‌లేద‌ని తాత్కాలిక విరామం మాత్ర‌మే తీసుకున్నామ‌ని ప్ర‌క‌టించారు.

జ‌లంత‌ర్గాముల‌ను మోహ‌రించ‌డంతో..

ఐఎన్ ఎస్ విక్రాంత్ (INS Vikrant) బ్ర‌హ్మోస్ క్షిప‌ణుల‌తో కూడిన యుద్ద నౌక‌లు జ‌లంత‌ర్గాముల‌ను మోహ‌రించ‌డంతో పాక్ కు ఊపిరి తీసుకోకుండా భార‌త నావికాద‌ళం ఎదురుదాడికి దిగింద‌ని పేర్కొన్నారు. ఆప‌రేష‌న్ లో భాగంగా ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను నేల‌మ‌ట్టం చేసిన త‌ర్వాత వెంట‌నే పాక్ నావికాద‌ళం కోలుకోకుండా దెబ్బ‌తీసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *