Budget Sessions: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Parliaments Budget Sessions) నేటి (జనవరి 31) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu) ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రేపు (ఫిబ్రవరి 1) 2025-26 ఏడాదికి గాను బడ్జెట్‌ను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రవేశ పెట్టనున్నారు. కాగా ఈసారి జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 4 వరకు రెండు విడతల్లో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించున్నారు. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు(Waqf Board Amendment Bill), బ్యాంకింగ్‌ చట్టాల సవరణ బిల్లు, రైల్వే సవరణ బిల్లు, విపత్తు నిర్వహణ సవరణ బిల్లుతో పాటు వలస, విదేశీయుల బిల్లులు ఈసారి కీలకం కానున్నాయి. ఇక రెండో విడతగా మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు సమావేశాలు జరుగుతాయి.

Parliament Budget Session Highlights: INDIA alliance MPs walk out of LS  over ex-Jharkhand CM Soren's arrest | India News - The Indian Express

మొత్తం 62 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం

ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Board Amendment Bill)ను ఈ బడ్జెట్ సమావేశాల్లో మోదీ(PM Modi) గవర్నమెంట్ పార్లమెంట్ కు తీసుకురాబోతున్నట్టు అఖిల పక్ష సమావేశం(All Party Meeting)లో వెల్లడించింది. ఈ సెషన్‌లో ప్రవేశ పెట్టే బిల్లులు లిస్ట్‌ను కేంద్ర సర్కార్ అఖిల పక్షానికి అందజేసింది. ఇందులో వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. మొత్తంగా 62 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అందులో 16 కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించేలా కేంద్ర ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు మహాకుంభమేళాలో తొక్కిసలాట(Mahakumbh Mela Stampede) అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి. అయితే, ఏయే అంశాలపై చర్చించాలనేది BAC సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు(Kiran Rijiju) ప్రకటించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *