Patnala Sudhakar: 120 డిగ్రీలు చేసిన విద్యావేత్త పట్నాల సుధాకర్ కన్నుమూత

120 డిగ్రీలు చేసిన ప్రముఖ విద్యావేత్త పట్నాల జాన్‌ సుధాకర్‌(Patnala John Sudhakar, 68) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం విద్యా, శాస్త్ర రంగాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విశాకపట్నం(Vizag) జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామానికి చెందిన సుధాకర్‌ మొదట్లో CBIలో చిన్నస్థాయి ఉద్యోగిగా చేరారు. అనంతరం పలు డిగ్రీలు చేస్తూ సివిల్స్‌(Civils)కు ఎంపికయ్యారు. ఢిల్లీలో సమాచార, ప్రసార శాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌(Additional Director General, Information and Broadcasting Department)గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయన తన అసాధారణ ప్రతిభ, అంకితభావంతో అనేక విద్యా సంస్థల్లో గుర్తింపు పొందారు. ఆయన భారతదేశంలోని పలు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో విద్యాబోధన చేశారు. అనేక అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నారు.

PATNALA SUDHAKAR | CIVIL SERVANT|HIGHEST EDUCATED MAN |TRIBUTE MESSAGE |  SURESH BETHA | BLN MASTER

సామాజిక సేవలోనూ సుధాకర్ తనదైన ముద్ర

ఆయన పరిశోధనలు ప్రధానంగా బయోటెక్నాలజీ(Biotechnology), స్పేస్ థెరప్యూటిక్స్ రంగాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. ఆయన రచించిన అనేక శాస్త్రీయ పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ఇటీవల ఆయన దక్షిణ కొరియాలోని ఒక విశ్వవిద్యాలయం నుంచి గౌరవ ఫెలోషిప్‌ను అందుకున్నారు. సామాజిక సేవలోనూ సుధాకర్ తనదైన ముద్ర వేశారు. విద్యా రంగంలో అవకాశాలు లేని వారికి సహాయం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఆయన మరణంతో శాస్త్ర, విద్యా రంగాలు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాయని సహోద్యోగులు, విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు పలు సంస్థలు, విద్యావేత్తలు సానుభూతి తెలియజేశారు. ఆయన జ్ఞాపకాలు శాస్త్రీయ సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *