Hari Hara Veeramallu: ఎల్లుండి ‘హరి హర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్.. ప్రీమియర్స్‌కు మేకర్స్ ప్లాన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu)’. ఈ చిత్రం జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీమియర్ షో(Premiere Shows)ల నిర్వహణ కోసం తీవ్రంగా కృషి చేస్తోందని తాజా సమాచారం. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, 17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ నటనతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

hari hara veera mallu : పవన్ అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్.. హరిహర వీరమల్లు  రిలీజ్ డేట్ లాక్ | mega surya productions official announcement on power  star pawan kalyan's harihara veeramallu release ...

ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌‌కు సిద్ధం

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం(AM Ratnam) నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ పొందింది. 2 గంటల 42 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఐదు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ప్రీమియర్ షోల కోసం ఓవర్సీస్ బయ్యర్స్‌తో సహా పలు థియేటర్లలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా సాయంత్రం 6 గంటలకు ప్రీరిలీజ్ ఫంక్షన్(Pre-release event) ఉండబోతోందని పేర్కొంది. ఇందులో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నట్లు ఏకంగా 300,000 మంది ఇంట్రెస్ట్ చూపించారు. ఇలా ఓ హిస్టారికల్ చిత్రంగా రాబోతున్న సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తుండటం నిజంగా విశేషం.

టికెట్ ధరలు ఇలా ఉండొచ్చు

ఇక ప్రీమియర్ షోల కోసం మేకర్స్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 24న సినిమా రిలీజ్ కానుండగా 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలకు అనుమతించాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. టికెట్ ధరలు ఏపీలో సింగిల్ స్క్రీన్‌-రూ.230, మల్టీప్లెక్స్‌-రూ.295, తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.265, మల్టీప్లెక్స్‌లో రూ.413 వరకూ ఉండొచ్చని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *