Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లేటెస్ట్ అప్డేట్.. పవన్ షూటింగ్ కంప్లీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న హై-ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ క్లైమాక్స్ సీన్ షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచానాలు ఉన్నాయి. 2016లో వచ్చిన తమిళ చిత్రం ‘తేరి(Teri)’ ఆధారంగా రూపొందినప్పటికీ, కొత్త కథాంశంతో పవన్ స్టైల్‌లో రీమేక్ కాదని రైటర్ దశరథ్ వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల(Sreeleela), రాశీ ఖన్నా(Rashi Khanna) హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ..

కాగా పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో షూటింగ్‌లో ఆలస్యం జరిగినప్పటికీ, ఆయన తన కమిట్‌మెంట్‌ను పూర్తి చేసేందుకు వేగంగా పనిచేశారు. జూన్ 2025 నుంచి హైదరాబాద్‌(Hyderabad)లో షూటింగ్ తిరిగి ప్రారంభమై, తాజాగా పవన్ తన భాగం షూటింగ్‌ను పూర్తి చేశారని టీమ్ తాజాగా ప్రకటించింది. కేవలం నాలుగైదు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని పవన్ గతంలో వెల్లడించారు. తాజాగా ఆ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించారు.

టీజర్, గ్లింప్స్‌ వీడియోలు బ్లాక్‌బస్టర్ హిట్!

ఈ చిత్రంలో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్(Police Officer) పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్‌లు అభిమానులను ఉర్రూతలూగించాయి. హరీష్ శంకర్-పవన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్‌బస్టర్ విజయం నేపథ్యంలో, ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025 చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *