ICC CT-2025: తగ్గిన పాక్.. హైబ్రిడ్ పద్ధతిలోనే ఛాంపియన్స్ ట్రోఫీ!

మినీ ప్రపంచకప్‌గా పేరొందిన ఛాంపియన్స్‌ ట్రోఫీ(Champions Trophy) నిర్వహణ వేదికపై సందిగ్ధం వీడినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్థాన్‌(Pakistan)లో జరగాల్సి ఉంది. అయితే భారత్-పాక్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో టీమ్ఇండియా(Team India) ఆ దేశంలో పర్యటించదని బీసీసీఐ(Board of Control for Cricket in India) తేల్చి చెప్పింది. అయితే భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లను వేరే దేశంలో నిర్వహిస్తే (Hybrid model) మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటామని భారత్ చెప్పింది. దీంతో టీమ్ఇండియా మ్యాచ్‌‌లను UAEలో నిర్వహించాలని పాక్ క్రికెట్‌ బోర్డును ICC కోరింది. దీనికి పాక్ బోర్డు తొలుత ఒప్పుకోలేదు. అయితే శనివారం జరిగిన సమావేశంలో పాక్ దీనికి ఒప్పుకున్నట్లు సమాచారం.

* టీమ్ఇండియా మ్యాచ్‌లు దుబాయ్‌లో..

అయితే దీనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా PCB, ICC మధ్య జరగిని సమావేశంలో ఓ ఒప్పందం కుదిరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతి(Hybride Model)లో జరిపేందుకు పీసీబీ అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్(Rashid Latif) ధ్రువీకరించారు. భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా దుబాయ్ వేదికగానే సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా జరుగుతాయని తెలిపారు.

భారత్‌ నాకౌట్‌కు చేరుకుంటే ఆ మ్యాచ్‌లు పాక్‌లోనే

“BCCI, PCBలతో ICC చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఇరు బోర్డులు కూడా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో జరిపేందుకు అంగీకరించాయి.” అని లతీఫ్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాక్ వద్దే ఉంటాయని.. అయితే భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్(Dubai) వేదికగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. భారత్‌ నాకౌట్‌కు చేరుకుంటే సెమీఫైనల్‌, ఫైనల్‌(Semis & Final) మ్యాచ్‌లు పాకిస్థాన్‌ వెలుపల జరుగుతాయి. అలాగే టోర్నీకి తమకు వచ్చే ఆదాయాన్ని పెంచాలి. 2031 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీలను పాక్ కూడా హైబ్రిడ్ విధానంలోనే ఆడుతుంది’’ అని లతీఫ్ తెలిపారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనుంది.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *