American Airlines: విమానంలో దట్టమైన పొగ, మంటలు.. ప్రయాణికుల భయాందోళన

వరుస విమాన ప్రమాదాలు ప్రజలు తీవ్రంగా భయపెడుతున్నాయి. మొన్న అహ్మదాబాద్‌ ఎయిరిండియా ఘటన(Ahmedabad Air India incident), నిన్న బంగ్లాదేశ్‌లో జెట్ క్రాష్(Jet crash in Bangladesh) వంటి ఘటనలు మరువక ముందే మరో భారీ విమానం ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక విషయానికొస్తే అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భయానక ఘటన చోటుచేసుకుంది. డెన్వర్ నుంచి మియామీకి బయలుదేరాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్(American Airlines) విమానం AA-3023 టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా, ల్యాండింగ్ గేర్‌లో టైర్ లోపం వల్ల మంటలు చెలరేగి, రన్‌వేపై దట్టమైన పొగలతో మంటలు(Fire with smoke) వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానం టేకాఫ్‌ను రద్దు చేశాడు. అందులోని 173 మంది ప్రయాణికులు, సిబ్బందిని అధికారులు అత్యవసరంగా, సురక్షితంగా ఖాళీ చేయించారు. ఈ ప్రక్రియలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

Passengers evacuate onto wing as American Airlines plane catches fire in  Denver

విమానంలో 180 మంది ప్రయాణికులు

ఘటన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. పొగలు గమనించిన వెంటనే, పైలట్ అత్యవసర ప్రోటోకాల్‌ను అనుసరించి, విమానాన్ని రన్‌వే నుంచి టెర్మినల్‌కు తిరిగి తీసుకొచ్చారు. అగ్నిమాపక బృందాలు, అత్యవసర సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అందరినీ రక్షించారు. దీంతో ఎటువంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదు. అయితే, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

ఇంజిన్‌లో సాంకేతిక లోపమే కారణం

ప్రాథమిక విచారణలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం(Technical fault in the engine) కారణంగా పొగలు వెలువడినట్లు తెలిసింది. నిపుణుల బృందం విమానాన్ని పరిశీలిస్తోంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. విమాన సంస్థ ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమాన ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *