Sankranti Holidays: సంక్రాంతి సందడి ముగిసే.. బ్యాక్ టు హైదరాబాద్

హైదరాబాద్‌ నుంచి సంక్రాంతి(Sankranti) పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లినవారు తిరుగు ప్రయాణమయ్యారు. పొంగల్ హాలిడేస్‌(Pongal Holiday)ను ఫుల్‌గా ఎంజాయ్ చేసేందుకు పల్లె బాట పట్టిన సంగతి తెలిసిందే. భోగి(Bhogi), సంక్రాంతి(Sankranti), కనుమ(Kanuma)ను సొంతూరి ప్రజల మధ్య సంతోషంగా జరుపుకున్నారు. ఇక మళ్లీ బిజీ లైఫ్‌కి పరిమితం కానున్నారు. ముఖ్యంగా హైదరాబాదులో ఉంటోన్న AP వాసులు పండగకు స్వగ్రామాలకు వెళ్లే ముందు హైదరాబాద్-విజయవాడ రహదారి కిక్కిరిసిపోయింది. ఇప్పుడు తిరుగు ప్రయాణంలో విజయవాడ- హైదరాబాద్ మార్గంలో వాహనాల రద్దీ(Vehicular traffic)పెరుగుతోంది.

బస్సుల్లో రిజర్వేషన్లు ఫుల్

మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా(Pantangi Toll Plaza) వద్ద హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలోనూ వాహనాలు రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పంతంగి టోల్ ప్లాజాలోని 12 టోల్‌బూత్‌ల ద్వారా AP to Telangana వైపునకు వాహనాలను అనుమతిస్తున్నారు. ఇక్కడ బుధవారం రాత్రి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ నుంచి హైదరాబాద్ బయలుదేరడానికి రావడంతో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు తదితర బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కూడా పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే సర్వీసుల్లో AC బస్సుల్లో రిజర్వేషన్లు(Reservstions) నిండిపోయాయి. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు 16, 17 తేదీల్లో బస్సులన్నీ రిజర్వేషన్లతో నిండిపోయాయి. అటు రద్దీని దృష్టిలో ఉంచుకొని APSRTC విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు అదనపు బస్సులను నడుపుతోంది.

రైళ్లలోనూ భారీగా వెయిటింగ్ లిస్ట్

మరోవైపు రైళ్లన్నీ(Trains) ఫుల్ అయిపోయాయి. గోదావరి, గౌతమి, నారాయణాద్రి, విశాఖపట్నం దురంతో, వందేభారత్‌, శబరి, విశాఖ, గరీబ్‌రథ్‌, జన్మభూమి తదితర రైళ్లలో భారీగా వెయిటింగ్‌ లిస్టు(Waiting list) ఉంది. కొన్నిట్లో ‘రిగ్రెట్‌’ అని చూపుతోంది. సికింద్రాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో 18, 19 తేదీల్లో వెయిటింగ్‌లిస్ట్‌ గరిష్ఠ పరిమితి కూడా దాటేసింది. దీంతో రైల్వే శాఖ స్పెషల్ రైళ్ల(Special trains)ను కేటాయించింది.

ప్రయాణికులకు గుడ్​న్యూస్ - సంక్రాంతికి మరికొన్ని స్పెషల్ ట్రైన్స్

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *