గిర్‌ అడవుల్లో ప్రధాని మోదీ సఫారీ.. ఫొటోలు వైరల్

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ జునాగఢ్ జిల్లాలోని గిర్ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ప్రపంచ వణ్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా లయన్‌ సఫారీ చేశారు. మోదీతో పాటు మంత్రులు, అటవీశాఖ అధికారులు ఉన్నారు.

ప్రధాని మోదీ సఫారీ

ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సఫారీ ముచ్చట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. వన్యప్రాణి కేంద్రంలో ఆయన దిగిన ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నారు. భూమ్మీద ఉన్న అపురూప జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రజలంతా కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రానున్న తరాలకు మంచి వనరులు అందించాలంటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.

ఇక గుజరాత్‌ పర్యటనలో భాగంగా మోదీ ఆదివారం రోజున రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారాను, సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత సాసన్‌లోని రాష్ట్ర అటవీశాఖ అతిథిగృహమైన సిన్హ్ సదన్‌లో బస చేసిన ఆయన.. సోమవారం తెల్లవారుజామున గిర్‌ వణ్యప్రాణి సంరక్షణ కేంద్రానికి వెళ్లారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *