ఈనెల 16 నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

ManaEnadu : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు ఖండాల్లోని మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఆఫ్రికా ఖండంలోని నైజీరియా, దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్, గయానా దేశాలను సందర్శించనున్నారు. 56 ఏళ్ల తర్వాత గయానాలో భారత ప్రధాని పర్యటించబోతుండటం గమనార్హం.

17 ఏళ్లలో నైజీరియాలో భారత ప్రధాని తొలి పర్యటన 

ఈనెల 16వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రధాని మోదీ నైజీరియా(Modi Nigeria Visit)లో పర్యటిస్తారు. 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు భారత విదేశాంగ శాఖ తాను విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ పర్యటనలో భాగంగా నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని తెలిపింది.

18న బ్రెజిల్ కు ప్రధాని మోదీ

ఇక నైజీరియా నుంచి ప్రధాని నవంబర్ 18న బ్రెజిల్‌ (Modi Brazil Visit) పర్యటనకు వెళ్లనున్నారు. 18, 19వ తేదీల్లో రియోడిజనీరో నగరంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాసియో లులా డా సిల్వా ఆధ్వర్యంలో నిర్వహించే జీ-20 సదస్సులో పాల్గొంటారు. ఈ సమ్మిట్‌లో పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపనున్నారు. బ్రెజిల్ తర్వాత మోదీ గయానాలో పర్యటిస్తారు.

56 ఏళ్ల తర్వాత గయానాకు భారత ప్రధాని

గయానీస్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ గయానాలో పర్యటించనున్నారు. 56 ఏళ్ల తర్వాత (1968 తర్వాత) భారత ప్రధాని గయానాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో మోదీ గయానా (Guyana) అధ్యక్షుడు మొహమ్మద్‌ అలీ.. ఇతర సీనియర్‌ నాయకులతోనూ సమావేశం కానున్నారు. గయానా పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం ఉండనుంది. అనంతరం ప్రవాస భారతీయుల సమావేశంలోనూ ఆయన మాట్లాడనున్నారు. ఇంకా.. ఇక్కడ జరిగే రెండవ CARICOM-ఇండియా సమ్మిట్‌లో కూడా మోదీ పాల్గొంటారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *