జనవరి 8న విశాఖకు ప్రధాని మోదీ

కొత్త ఏడాదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏపీలో పర్యటించనున్నారు. ఆయన విశాఖలో పర్యటించనున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మోదీ.. విశాఖ ఎయిర్‌పోర్టు (Visakha Airport)కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) ఇంజినీరింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారని వెల్లడించారు.

బహిరంగ సభలో మోదీ ప్రసంగం

ఏయూకు చేరుకున్న తర్వాత ప్రధాని మోదీ.. ఎన్టీపీసీ (NTPC) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు ప్రాజెక్టుకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. వాటితో పాటు రైల్వే జోన్‌ పరిపాలన భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu)తో పాటు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. అని విశాఖ జిల్లా అధికారులు తెలిపారు.

మోదీ రాకకు ఏర్పాట్లు

మరోవైపు ప్రధాని (PM Modi Visakha Visit) రాక సమాచారం అందుకున్న అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *