Prabhas: బాహుబలి: ది బిగినింగ్ రీరిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి: ది బిగినింగ్(Baahubali: The Beginning)’ విడుదలై 2025 జులై 10 నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రం, పాన్ ఇండియా(Panindia) ట్రెండ్‌కు ఆద్యురాలిగా నిలిచి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ప్రభాస్(Prabhas), రానా దగ్గుబాటి(Rana Daggubati), అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, రూ.250 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొంది. వెయ్యి కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డుల(industry records)ను తిరగరాసింది. ఈ పదవ వార్షికోత్సవం సందర్భంగా, ‘బాహుబలి’ రీరిలీజ్‌(Baahubali re-release)కు సిద్ధమవుతోంది. నిర్మాత శోభు యార్లగడ్డ(Shobhu Yarlagadda) ఈ ఏడాది అక్టోబర్‌ 31న ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో భారత్‌తో పాటు అంతర్జాతీయంగా గ్రాండ్ రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కొత్త ఆకర్షణలు, సర్‌ప్రైజ్‌లతో ఫ్యాన్స్‌ ముందుకు..

కాగా రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా 4కే వెర్షన్‌లో తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ రీరిలీజ్ కేవలం సినిమా ప్రదర్శనతోనే కాకుండా, కొత్త ఆకర్షణలు, సర్‌ప్రైజ్‌లతో అభిమానులకు ఉత్సవ శోభను అందించనుంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఎక్కువ భాగం చిత్రీకరించిన ఈ చిత్రం, కాలకేయుల యుద్ధ(Kalakeya War Scenes) సన్నివేశం కోసం 5000 మంది జూనియర్ ఆర్టిస్టులతో 250 రోజులు షూటింగ్ జరిపింది. కీరవాణి సంగీతం, పీటర్ హెయిన్ యాక్షన్ డిజైన్ ఈ సినిమాకు జీవం పోశాయి. అభిమానులు #DecadeofBaahubaliReign హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా(SM)లో సంబరాలు జరుపుతున్నారు.

Watch Baahubali: The Beginning (English Version) | Netflix

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *