Baahubali Re-release: బాహుబలి వస్తున్నాడు.. మరోసారి థియేటర్లోకి సూపర్ హిట్ మూవీ

భారతీయ సినిమా చరిత్రలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘బాహుబలి: ది బిగినింగ్(Baahubali: The Beginning)’ చిత్రం విడుదలై రేపటికి పదేళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ఈ హిస్టారిక్ చిత్రం మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఈ ఎపిక్ మూవీలో ప్రభాస్(Prabhas), రానా దగ్గుబాటి(Rana Daggubati), అనుష్క శెట్టి(Anshka Shetty), తమన్నా భాటియా(Tamannah Bhatia) లాంటి తారాగణంతో జులై 10, 2015లో విడుదలై, పాన్-ఇండియా(Pan India) సినిమా ట్రెండ్‌కు బీజం వేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటింది.

Bahubali – From an investors Point of view – Master Moves

బాహుబలి రెండు పార్టులను కలిపి ఓకే చిత్రంగా..

జులై 10, 2025న ‘బాహుబలి’ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, చిత్ర యూనిట్ రీ-రిలీజ్(Rerelease) ప్రకటనతో అభిమానులను ఉత్తేజపరిచింది. నిర్మాత షోబు యార్లగడ్డ(Shobu Yarlagadda) నేతృత్వంలోని ఆర్కా మీడియా వర్క్స్, ఈ రీ-రిలీజ్‌లో ప్రత్యేక ఆకర్షణలతో సినిమాను మరింత గ్రాండ్‌గా అందించనున్నట్లు సూచనలు ఇచ్చింది. ‘బాహుబలి’ రెండు భాగాల కీలక సన్నివేశాలను ఒకే చిత్రంగా ఎడిట్ చేసి, సూపర్ 4K టెక్నాలజీలో ప్రేక్షకులకు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్విస్ట్ అభిమానులకు డబుల్ ట్రీట్‌గా నిలవనుంది.

ప్రపంచ వ్యాప్తంగా రీరిలీజ్ చేసే ఛాన్స్

ఈ రీ-రిలీజ్‌తో ‘బాహుబలి’ మరోసారి బాక్సాఫీస్(Box Office) వద్ద రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోషల్ మీడియాలో ‘#బాహుబలి వస్తున్నాడు’ ట్రెండ్‌తో అభిమానులు హైప్‌ను పెంచుతున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2025లో భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా కూడా రీ-రిలీజ్ కానుందని సమాచారం. మరోసారి ‘బాహుబలి’ మ్యాజిక్‌ను థియేటర్లలో ఆస్వాదించడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *