The Rajasaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మళ్లీ వాయిదా! నిర్మాణ సంస్థపై కేసు

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నటిస్తున్న భారీ చిత్రం ‘ది రాజాసాబ్ (The Rajasaab)’ విడుదల మరోసారి వాయిదా(Postpone) పడే అవకాశం ఉంది. దీంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. మారుతి(Maruthi) దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ చిత్రం రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవికా మోహనన్(Malavika Mohanan), రిద్ధీ కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5, 2025న విడుదల కావాల్సి ఉండగా, వీఎఫ్ఎక్స్ పనులు, ఇతర కారణాలతో 2026 జనవరి 9 సంక్రాంతి(Sankranthi)కి వాయిదా పడినట్లు సినీవర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Prabhas' 'The Raja Saab' Locks Release Date

ఒప్పందం ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవడంతో

ఇదిలా ఉండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై ముంబైకి చెందిన IVY ఎంటర్‌టైన్‌మెంట్స్ ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)లో కేసు నమోదు చేసింది. ఈ సంస్థ ‘ది రాజాసాబ్’ కోసం రూ. 218 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఒప్పందం ప్రకారం షూటింగ్ పూర్తి కాకపోవడం, అప్‌డేట్స్ ఇవ్వకపోవడం, డబ్బు వినియోగంపై సమాచారం లేకపోవడంతో మోసం జరిగిందని ఆరోపించింది. 18% వడ్డీ(Interest)తో రూ. 218 కోట్లు తిరిగి చెల్లించాలని, అంతవరకు సినిమా విడుదల నిలిపివేయాలని IVY డిమాండ్ చేసింది.

రిలీజ్ సమయంలో చెల్లింపులు పూర్తి చేస్తాం

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందిస్తూ, నాన్-థియేట్రికల్ డీల్(Non-theatrical deal) ఇంకా క్లోజ్ కాలేదని, షూటింగ్ చివరి దశలో ఉందని, రిలీజ్ సమయంలో చెల్లింపులు పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపింది. IVY సంస్థ తాత్కాలికంగా ఒప్పుకున్నట్లు సమాచారం, కానీ వివాదం పూర్తిగా ముగిసిందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిక్కులతో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొని, అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *