వాజ్​పేయీకి రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళి

Mana Enadu : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ (Atal Bihari Vajpayee) శత జయంతి సందర్భంగా దిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా(Amit Shah), జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu), పలువురు ఎంపీలు వాజ్‌పేయీకి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వాజ్‌పేయీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన దూర దృష్టి వల్లే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని అన్నారు. వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ‘ఎక్స్‌’లో ఆయన పోస్ట్‌ చేశారు. భారతజాతి గర్వించదగిన నేత వాజ్‌పేయీ అని కొనియాడారు.  దేశం గురించి ఆలోచించే తీరు విలక్షణమైనదని కితాబిచ్చారు. సంస్కరణల ప్రతిపాదనలపై వాజ్‌పేయీ స్పందించిన తీరు ఎన్నటికీ మరచిపోలేనని తెలిపారు. ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాను అని చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పోస్టులో పేర్కొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *