PM Modi: నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే

ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈ రోజు మహా కుంభమేళా(Maha Kumbh)లో పాల్గొననున్నారు. త్రివేణీ సంగమం(Triveni Sangamam)లో ఆయన పుణ్యస్నానం ఆచరిస్తారు. అనంతరం గంగాదేవికి ప్రార్థనలు చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. అటు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో UP CM యోగి ఆదిత్యనాథ్ మంగళవారం రాత్రే ప్రయాగ్ రాజ్(Prayagraj) మహా కుంభమేళా ప్రాంతానికి చేరుకున్నారు. కాగా మోదీ ఉదయం 10 గంటలకు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అరైల్(Arile Ghat) ఘాట్‌కు వెళ్తారు. 11 గంటలకు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు.

దాదాపు 40 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు

అనంతరం ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంకు వెళ్లి ఢిల్లీ(Delhi)కి తిరుగు ప్రయాణం అవుతారు. మోదీ రాక నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ నగరంతో పాటు కుంభమేళా వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు(Police heavy security) చేశారు. కాగా జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభం కాగా, భారత్‌తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు(Devotees) హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 40 కోట్ల మందికిపైగా కుంభమేళాకు వచ్చినట్లు UP ప్రభుత్వం తెలిపింది. సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

India's Kumbh Mela creates Guinness World Records | SBS Hindi

తొక్కిసలాట ఘటనపై పిల్

కాగా మహా కుంభమేళాలో జనవరి 29న మౌని అమావాస్య(Mouni Amavasya) సందర్భంగా తొక్కిసలాట(Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడినట్లు యూపీ సర్కారు వెల్లడించింది. అయితే ఈ ఘటనకు యూపీ ప్రభుత్వ అధికారులే కారణం అంటూ ఓ న్యాయవాది సుప్రీం కోర్టు(Supreme Court)లో పిల్ వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఆ పిల్‌(Pill)ను తిరస్కరించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *