Punjab Kings: అయ్యర్ అదరహో.. ముంబై చిత్తు.. పదేళ్ల తర్వాత ఫైనల్‌కు పంజాబ్

IPL 2025 సీజన్‌లో పంజాబ్ ఫైనల్ చేరింది. అవును ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్(MI)ను 5 వికెట్ల తేడాతో పంజాబ్(PBKS) చిత్తు చేసింది. దీంతో 2014 తర్వాత తొలిసారి ఆ జట్టు ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఆదివారం వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన క్వాలిఫయర్-2 మ్యాచులో ముంబై ఇండియన్స్‌తో పంజాబ్ తలపడింది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 203/6 పరుగులు చేసింది. రోహిత్ (8) విఫలమైనా.. బెయిర్ స్టో (38), తిలక్ వర్మ (44), సూర్య కుమార్ (44), పాండ్య (15), నమన్ ధీర్ (37) రన్స్ చేశారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా 2, జెమీసన్, స్టొయినిస్, విజయ్ కుమార్, చాహల్ తలో వికెట్ తీశారు.

అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్..

అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 13 వద్ద ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (6) ఔటయ్యాడు. మరో ఓపెనర్ ప్రియాన్ష్ (20) రన్స్ చేసి ఔటయ్యాడు. అనంతరం ఇంగ్లిస్ (38) సాయంతో అయ్యర్(Shreyas Ayyar) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 41 బంతుల్లో 87* రన్స్‌తో మెరుపులు మెరిపించాడు. ఇంగ్లిస్ ఔటయ్యాక నెహాల్ వధేరా (48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో సిక్సర్ బాది పంజాబ్‌కు అయ్యర్ చిరస్మరణీయ విజయం అందించాడు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ 2, బౌల్ట్, పాండ్య చెరో వికెట్ తీశారు. సూపర్ ఇన్నింగ్ ఆడిన అయ్యర్‌కు “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది. కాగా రేపు ఇదే అహ్మదాబాద్(Ahmadabad) వేదికపై జరిగే ఫైనల్లో RCBని పంజాబ్ ఢీకొట్టనుంది. ఇందులో ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్‌ కావడం గమనార్హం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *