పుష్ప-3 లేటెస్ట్ అప్డేట్.. టైటిల్‌ ఏంటో తెలుసా?

Mana Enadu : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప2: ది రూల్‌ (Pushpa 2 : The Rule)’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. డిసెంబరు 5వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది. తాజాగా సోమవారం రోజున హైదరాబాద్ లో పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

పుష్ప-3పై సుకుమార్ హింట్

ఈ ఈవెంట్ లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప పార్ట్-1, పార్ట్-2 కోసం అల్లు అర్జున్ ను మూడేళ్లు కష్టపెట్టానని అన్నారు. తను మళ్లీ మూడేళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉంటే ‘పుష్ప3’ చేస్తానని (Pushpa3 Update) తెలిపారు. దీంతో పుష్ప-2కు కొనసాగింపుగా ‘పుష్ప3’ ఉంటుందనే టాక్‌ వినిపిస్తోంది. అది నిజం చేస్తూ, తాజాగా ఓ ఫొటో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

పుష్ప-3 టైటిల్ ఇదే

పుష్ప సినిమాకు సౌండ్‌ ఇంజినీర్‌గా ఆస్కార్‌ అవార్డు విజేత రసూల్‌ పూకుట్టి పని చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోను స్కాన్ చేసిన నెటిజన్లు ఓ క్రేజీ విషయం కనిపెట్టారు. ఫొటో వెనుక ‘పుష్ప3’ టైటిల్‌ (Pushpa 3 Title) ఉన్న పోస్టర్ కనిపించింది. అందులో ‘పుష్ప3: ది ర్యాంపేజ్‌ (Pushpa 3 : The Rampage)’ అని ఉండటంతో పార్ట్‌-2 చివరిలో మూడో భాగానికి సంబంధించిన హింట్స్ ఇవ్వబోతున్నారని నెటిజన్లు అంటున్నారు.

మరో రెండ్రోజుల్లో పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు

ఇక పుష్ప-2 సినిమా డిసెంబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ (Pushpa 2 Release Date) కాబోతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీల (Sree Leela) స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. ఇంకా ఈ చిత్రంలో అనసూయ, ఫహాద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీఎస్పీ మ్యూజిక్ అందించారు. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *