PV Sindhu: సయ్యద్​ మోదీ టోర్నీలో ఫైనల్​కు దూసుకెళ్లిన పీవీ సింధు

భారత్​ స్టార్​ షెట్లర్​ పీవీ సింధు (PV Sindhu) మునుపటి ఫామ్​ను అందుకుంది. ప్రతిష్ఠాత్మక సయ్యద్​ మోదీ అంతర్జాతీయ సూపర్​ 300 (Syed Modi International Super 300) టోర్నీలో సింధు ఫైనల్​కు దూసుకెళ్లింది. లక్నోలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్​ సెమీస్​లో సింధు 21–12,21–9 తేడాతో భారత్​కే చెందిన ఉన్నతి హుడాపై (Unnati Huda) గెలుపొందింది. సింధు చెలరేగడంతో ఈ మ్యాచ్​ కేవలం 36 నిమిషాల్లోనే ముగిసింది.

ఈ మ్యాచ్​ తర్వాత సింధు ((PV Sindhu) మాట్లాడుతూ.. ‘నేటి ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా. ఎంతో కాన్ఫిడెంట్​గా ఉండి కొన్ని మంచి షాట్లు ఆడాను. గేమ్​ మొదటి నుంచి లీడ్​ మెయింటెయిన్​ చేశా. ఉన్నతి కూడా తన ఉత్తమ ప్రదర్శన చేసింది. కానీ నామీద పైచేయి సాధించేలా ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఆమెకు మంచి ఫ్యూచర్​ ఉంటుంది. ఆమెకు నా బెస్ట్​ విషెస్​. రేపటి ఫైనల్​ సులువుగా ఉండకపోవచ్చు. మ్యాచ్​ కోసం సిద్ధమై నా బెస్ట్​ ఇవ్వాలి’ అని పేర్కొంది. ఫైనల్​లో సింధు మాజీ ఛాంపియన్​ చైనాకు చెందిన వు లివో యుతో తలపడనుంది.

మిక్స్​డ్​ డబుల్స్​లో తనీషా క్రాస్టో–ధ్రువ్​ కపిల జోడీ కూడా ఫైనల్​కు చేరుకుంది. నాలుగో సీడ్​ అయిన హాంగ్​ జౌ–జియా యి యాంగ్​ (చైనా)పై 21–16, 21–15 వరుస గేముల్లో విజయం సాధించారు. 42 నిమిషాల్లోనే ఈ మ్యాచ్​ ముగిసింది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *