MI vs RR: జైపూర్‌లో స్పెషల్ మ్యాచ్.. టాస్ నెగ్గిన రాజస్థాన్

IPL 2025లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్‌ వర్సెస్ ముంబై ఇండియన్స్(RR vs MI) జట్లు తలపడుతున్నాయి. జైపూర్(Jaipur) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో రాజస్థాన్ టాస్ నెగ్గి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ రియాన్ పరాగ్(Riyan Parag) తెలిపాడు. హసరంగ, సందీప్ శర్మ స్థానాల్లో కుమార కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్ జట్టులోకి వచ్చారు. అటు ముంబై మాత్రం గత మ్యాచులో ఆడిన జట్టుతోనే ఆడుతోంది. కాగా ఇవాళ ముంబై నెగ్గితే టాప్ ప్లేస్‌కి చేరుతుంది. అటు రాజస్థాన్ ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు క్లిష్టమవుతాయి. కాగా ఈ మ్యాచులో తమ ప్లేయర్లు కొట్టే ఒక్కో సిక్సుకు పేదల ఇళ్లల్లో సోలార్ ప్యానెళ్లు(Solar Panels) ఏర్పాటు చేయనున్నట్లు రాయల్స్ మేనేజ్మెంట్ ప్రకటించింది.

Image

ముంబై గెలిస్తే టాప్‌ ప్లేస్

కాగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ గాయాల కారణంగా స్థిరంగా జట్టుతో ఉండలేకపోయినా.. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) వంటి ఓపెనర్లు ఫామ్‌లోకి రావడం ఆ జట్టకు ప్లస్ పాయింట్. మరోవైపు ఈ సీజన్ ఆరంభంలో డిజాస్టర్‌గా కనిపించిన ముంబై.. ఇప్పుడు వేరే జట్టులా రాణిస్తోంది. వరుస ఐదు విజయాలతో టేబుల్‌లో మూడో స్థానానికి ఎగబాకింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్, హార్దిక్ లాంటి ఆటగాళ్లు తలపడటంతో జట్టు ఆటకు ఓ నూతన ఉత్సాహం వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 31సార్లు తలపడ్డాయి. ముంబై 16 మ్యాచ్‌లు గెలిస్తే, రాజస్థాన్ 15 సార్లు విజయం సాధించింది.

తుది జట్లు ఇవే..

Rajasthan Royals: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(C), ధృవ్ జురెల్(WK), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, ఫజల్‌హక్ ఫరూఖీ

Mumbai Indians: ర్యాన్ రికెల్టన్(WK), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య(C), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *