Ramayana: నేడు ‘రామాయణ’ గ్లింప్స్ రిలీజ్.. ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

బాలీవుడ్‌(Bollywood)లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘రామాయణ(Ramayana)’ మొదటి గ్లింప్స్(Glimpse) ఈ రోజు (జులై 3) విడుదల కానుంది. ఈ మూవీని ప్రముఖ డైరెక్టర్ నితేష్ తివారీ(Nitesh Tiwari) ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నమిత్ మల్హోత్రా(Namit Malhotra) నిర్మాణంలో రూపొందుతోన్న ఈ భారతీయ పౌరాణిక చిత్రం(Indian mythological film) రెండు భాగాలుగా (తొలి పార్టు 2026, రెండో పార్టు 2027) దీపావళి సందర్భంగా విడుదల కానుంది. రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతగా, యష్(Yash) రావణుడిగా, సన్నీ డియోల్(Sunny Deol) హనుమంతుడిగా, లారా దత్త(Laura Dutta) కైకేయిగా, అరుణ్ గోవిల్(Arun Govil) దశరథుడిగా నటిస్తున్న ఈ చిత్రం సుమారు రూ. 835 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

EXCLUSIVE: "Ramayana Part 1 is finished; Part 2 will be done before the  release of Part 1," confirms Ranbir Kapoor

ఉదయం 11:30 గంటలకు ఏకంగా 9 నగరాల్లో..

కాగా ఈ మూవీ గ్లింప్స్‌(Glimpse)ను ఈ రోజు బెంగళూరులోని PVR ఫోరమ్ మాల్‌లో ఉదయం 11:30 గంటలకు గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. కాగా, ఇండియా వ్యాప్తంగా 9 నగరాల్లో ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఇక ఈ గ్లింప్స్‌ను బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా, పుణే, కొచ్చి, హైదరాబాద్ నగరాల్లోని పలు థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో మూడు నిమిషాల పాటు సాగే గ్లింప్స్‌ వీడియోను రిలీజ్ చేసే ఛాన్సుంది.

ఈ చిత్రం భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే లక్ష్యంతో, ఆస్కార్ విజేత DNEG స్టూడియో విజువల్ ఎఫెక్ట్స్‌తో, ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంగీతంతో రూపొందుతోంది. సోషల్ మీడియా(Social Media)లో ఈ గ్లింప్స్‌పై ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ తొలి పార్ట్ షూటింగ్ పూర్తికాగా.. రెండో పార్ట్ షూటింగ్(Second Part) వచ్చే నెల ప్రారంభం కానుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *